అధ్వానంగా రోడ్డు
● గుంతలో దిగబడిన
ధాన్యం వ్యాన్
కామారెడ్డి రూరల్: కామారెడ్డి శివారులోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో గుంతలు ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధాన్యం లోడ్తో వెళ్తున్న ఓ వ్యాన్ ఈ గుంతలలో దిగబడింది. ఒకవైపు ఒరిగిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్నవారు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ వాహనాన్ని నిలిపి, పొక్లెయిన్ను తెప్పించి వ్యాన్ను పక్కకు తీశారు. ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
