
‘వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు’
కామారెడ్డి టౌన్: పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవల్లో నిర్లక్షం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ హాల్లో పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య కార్యక్రమాల లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గ్రామాలలో డయాబెటిక్, బీపీ, టీబీ, క్షయ, హెచ్ఐవీ తదితర వ్యాధులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్షేత స్థాయిలో ప్రజలకు స్క్రీనింగ్ వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు ఇవ్వాలన్నారు.