ఇప్పటికే రొయ్యలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెంచడం మరింత భారం కానుంది. ఆక్వాలో ఖర్చులు పెరిగిపోయి, పంటకు ఎకరాకు అదనంగా రూ.24 వేలు భారమంటే సామాన్య రైతులు ఎలా సాగు చేస్తారు? ఆశించిన దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా మేతల ధరలు పెరిగినా నోరు మెదపకపోవడం అన్యాయం. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయలేం.
– అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, ఆక్వా రైతు లచ్చిపాలెం,
తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా


