బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కాకినాడలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు కాకినాడలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ పరీక్షకు 3,126 మంది దరఖాస్తు చేసుకోగా 3,080 మంది హాజరయ్యారు. జీపీటీ కళాశాల, ఆనంద భారతి గ్రౌండ్ వద్ద రాజీవ్గాంధీ మున్సిపల్ పాఠశాలల్లోని కేంద్రాలను కలెక్టర్ హరీంధిర ప్రసాద్, గాంధీనగర్ పైండా సత్తిరాజు మున్సిపల్ పాఠశాలను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు సందర్శించారు.


