
అక్షరంపై కక్ష కట్టి..
‘సత్యమేవ జయతే’ హితోక్తిని మకుటంలో ధరించి.. ఆ మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి.. ప్రభుత్వ విధానాల్లోని దుర్నీతిని ఎండగడుతూ.. నిరంతరం జనపక్షం వహిస్తూ.. ప్రజలకు నిత్యసత్యాలను అందిస్తున్న ‘సాక్షి’ అక్షరంపై పాలకులు కక్ష కట్టారు. సాకు కోసం వేచి చూసి.. మూకదాడికి ‘కూటమి’ కట్టారు. అణగారిన ప్రజల మనస్సాక్షిగా నిలుస్తున్న పత్రిక కార్యాలయంపై తెగబడ్డారు. పత్రిక నేమ్బోర్డును బలవంతంగా పెకలించి, ధ్వంసం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ మూకల బరితెగింపు చూసి అటుగా వెళ్తున్న సామాన్య ప్రజలు నివ్వెరపోయారు. చక్కటి పాలన అందించాలని అందలం ఎక్కిస్తే.. ఇలా అరాచకానికి పాల్పడటమేమిటంటూ నిర్ఘాంతపోయారు.
రాజానగరం: ‘సాక్షి’ టీవీలో ఇటీవల జరిగిన ఒక చర్చాగోష్టిలో అమరావతి మహిళలను కించపరిచేలా ఓ వ్యక్తి వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆ పార్టీతో కూటమిగా ఉన్న బీజేపీ, జనసేన శ్రేణులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని, సాక్షి కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు పాల్పడి, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయం వద్ద కూడా కూటమి నేతలు ఆదివారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం అవి మరింత పరాకాష్టకు చేరాయి. ఆందోళనకారుల దుర్మార్గ చర్యలను నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులు కూడా గాయపడ్డారంటే వారి చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఏం జరిగిందంటే..
రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(బీజేపీ)తో పాటు అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన రెండు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు సాక్షి ముద్రణా కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి, ఆందోళనకు దిగారు. ఉదయం 10.30 గంటల సమయంలో రాజానగరం ఎమ్మెల్యే తన అనుయాయులతో కలసి ఆందోళన చేపట్టారు. సాక్షి మీడియాకు, వైఎస్సార్ సీపీకి, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి తన వర్గీయులతో అక్కడకు చేరుకున్న అనపర్తి ఎమ్మెల్యే ఆ ఆందోళనను కొనసాగిస్తూ విధ్వంసం దిశగా నడిపించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు సాక్షి దిన పత్రికలను వేసి దహనం చేశారు. పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు ఆగలేదు.
దౌర్జన్యం
ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి ప్రోత్సాహంతో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి మరింత రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులను ఉసిగొల్ప్పారు. దీంతో, అన్నవరం దేవస్థానం మాజీ డైరెక్టర్ సత్తి దేవానందరెడ్డి (బాబు), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పుట్ట గంగాధర్ చౌదరి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి, ప్రధాన కార్యదర్శి సువాసిని, బిక్కవోలు యూత్ కమిటీ అధ్యక్షుడు పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరితో పాటు కొంతమంది మహిళా కార్యకర్తలు కార్యాలయం ప్రహరీకి అమర్చి ఉన్న సాక్షి నేమ్ బోర్డును బలవంతంగా పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులను ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సైలు నాగార్జున, నారాయణమ్మతో పాటు కొంతమంది పోలీసుల చేతులకు కూడా గాయాలయ్యాయి.
ఫ నిజాలు చెబుతున్న ‘సాక్షి’పై అక్కసు
ఫ దాడికి ‘కూటమి’ కట్టారు
ఫ రాజానగరంలోని పత్రికా కార్యాలయం వద్ద ఆందోళన
ఫ మూకుమ్మడి దాడి
ఫ అనపర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యాన చెలరేగిపోయిన మూకలు
ఫ సాక్షి నేమ్ బోర్డు పీకేసి..
పత్రికల దహనం
ఫ అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలు

అక్షరంపై కక్ష కట్టి..

అక్షరంపై కక్ష కట్టి..

అక్షరంపై కక్ష కట్టి..

అక్షరంపై కక్ష కట్టి..