దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా త్రినాథరావు | - | Sakshi
Sakshi News home page

దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా త్రినాథరావు

Jun 10 2025 7:12 AM | Updated on Jun 10 2025 7:12 AM

దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా త్రినాథరావు

దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా త్రినాథరావు

అన్నవరం: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావును దేవదాయశాఖ రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ (రాజమహేంద్రవరం)గా బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థానానికి ఈఓని నియమించేవరకు ఆ దేవస్థానానికి ఇన్‌చార్జి ఈఓగా కూడా కొనసాగాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇన్‌చార్జి ఆర్‌జేసీగా పనిచేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓ వి. సత్యనారాయణమూర్తికి ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించారు. త్రినాథరావు గతంలో రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా, రెండుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా, 2020–22 మధ్య రెగ్యులర్‌ ఈఓగా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఓగా 2024లో బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన సెలవు పై విదేశాలకు వెళ్లగా ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఆర్‌జేసీ సుబ్బారావును సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈఓగా నియమించారు. ఏప్రిల్‌ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఆరుగుగు భక్తులు మృతి చెందిన ఘటనలో ఇన్‌చార్జి ఈఓ సుబ్బారావుతో సహా ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. త్రినాథరావు సెలవు అనంతరం మే 26న సింహాచలం దేవస్థానం ఈఓగా జాయిన్‌ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement