
కిక్ బాక్సర్కు ఎస్పీ అభినందన
కాకినాడ క్రైం: కిక్ బాక్సింగ్లో రాణిస్తున్న కాకినాడ నగరానికి చెందిన యువతి లేఖా నిహారికను ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఆయన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఖా నిహారిక కేరళలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ శిక్షణలో రాణించి హంగేరియన్ వాకో వరల్డ్ కప్ పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయని అన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.