రెండు జేసీబీల స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రెండు జేసీబీల స్వాధీనం

May 3 2025 7:52 AM | Updated on May 3 2025 7:52 AM

రెండు జేసీబీల  స్వాధీనం

రెండు జేసీబీల స్వాధీనం

పి.గన్నవరం: గడువు ముగిసినా మానేపల్లి లంక నుంచి పెదకందాలపాలెం ర్యాంపు మీదుగా అక్రమంగా మట్టి తరలిస్తున్న నేపథ్యంలో మైన్స్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పెదకందాలపాలెం వద్ద ర్యాంపులో ఉన్న రెండు జేసీబీలను సీజ్‌ చేశారు. మానేపల్లిలంక నుంచి హైవే పనులకు మట్టి తీసేందుకు గడువు ముగిసిందని మైన్స్‌ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ర్యాంపులో పనిచేస్తున్న రెండు జేసీబీలు సీజ్‌ చేసినట్టు మైన్స్‌ ఆర్‌ఐ సుజాత తెలిపారు. గడువు ముగిసిన నేపథ్యంలో ఈ ర్యాంపుల నుంచి మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. మైన్స్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ రెహమాన్‌ అలీ, మానేపల్లి వీఆర్వో నాగన్న ఆమె వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement