
బొప్పాయికి రింగ్ స్పాట్
మొజాయిక్
ఇది వైరస్ వలన పంటను ఆశిస్తుంది. ఆకులపైన పసుపు వర్ణం, ఆకుపచ్చ వర్ణం కలిగిన కణజాలం తయారై మొజాయిక్ లక్షణాలు కనబడతాయి. ఈ తెగులు సోకిన ఆకులు క్రమేపీ పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. తెగులు సోకిన చెట్టు కాయ పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోతుంది. ఈ తెగులును తెల్లదోమ వ్యాప్తి చేస్తుంది.
నివారణ చర్యలు
బొప్పాయి పంట సాగుచేసే రైతులు మొక్కలు నాటిన 20 రోజుల తరువాత వేపనూనెను 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ తెగులును వ్యాప్తి చేసే దోమను నివారించవచ్చు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు.
● మొక్కతోటలపై ప్రభావం అధికం
● సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
పెరవలి: జిల్లాలో బొప్పాయి తోటలు 200 హెక్టార్లలో సాగు జరుగుతుండగా ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 50 హెక్టార్లలో ఈ పంట పండిస్తున్నారు. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కడియం, కొవ్వూరు, మండలాల్లో కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. బొప్పాయి తోటలపై మొజాయిక్, రింగ్స్పాట్, ఆకుముడత వంటి తెగుళ్లు ఎక్కువగా ఆశించి ఉండటంతో మొక్కల్లో ఎదుగుదల ఆగి తోటలు పాడైపోతున్నాయని కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. వీటిపై వచ్చే తెగుళ్లు, సస్యరక్షక్ష ణ చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన వివరించారు.
రింగ్స్పాట్ వైరస్
ఈ తెగులు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులతో వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకుల పరిమాణం తగ్గి సన్నటి తీగవలె మారుతాయి. కాయలు, కాండం పైన ఉంగరం లాంటి మచ్చలు ఏర్పడి నాణ్యతను కోల్పోయేలా చేస్తాయి. పండ్లు ముగ్గినప్పుడు రింగ్ ఏర్పడినచోట వాసన వస్తుంది.
నివారణ చర్యలు
బొప్పాయి పంట సాగుచేసే రైతులు మొక్కలు నాటిన 20 రోజుల తరువాత వేపనూనెను 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే ఈ తెగులును వ్యాప్తిచేసే దోమను నివారించవచ్చు. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు.
ఆకుముడత తెగులు
ఈ తెగులు పురుగుల వల్ల వైరస్ వ్యాప్తిచెంది తీవ్ర నష్టాన్ని కలుగుతుంది. తెగులు ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుని పోతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ఉండలుగా మారి వికృత రూపం దాల్చుతాయి. కాయలు సహజ ఆకారాన్ని కోల్పోయి వంకరటింకరగా తయారవుతాయి. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ తెగులును రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంకలు వ్యాప్తి చేస్తాయి.
నివారణ చర్యలు
ఎసిటామిఫ్రిడ్ ఎకరానికి 40 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా డయోమిథాగ్జామ్ 10లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్ల మందును కలిపి పిచికారీ చేస్తే తెగులును నివారించవచ్చు.
ఎరువుల యాజమాన్యం
బొప్పాయి మొక్కలకు ఎరువులు ఎక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. మొక్కలు నాటినప్పుడే కాక ప్రతీ మొక్కకు రెండునెలలకు ఒకసారి 90 గ్రాముల యూరియా, 250 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్పేట్, 150 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. ఇలా సంవత్సరానికి 6 దఫాలుగా ఎరువులు వేస్తే మొక్కకు మంచి పోషకాలు అందుతాయి. ఈ విధంగా ఎరువులు వినియోగించడం వల్ల మొక్కకు మంచి పోషకాలు అంది అధిక దిగుబడిని అందిస్తాయి. సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపటినప్పుడు తెగుళ్లను నివారించవచ్చు.
–సీహెచ్ శ్రీనివాస్, ఉద్యాన అధికారి, కొవ్వూరు

బొప్పాయికి రింగ్ స్పాట్

బొప్పాయికి రింగ్ స్పాట్

బొప్పాయికి రింగ్ స్పాట్

బొప్పాయికి రింగ్ స్పాట్

బొప్పాయికి రింగ్ స్పాట్