అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు

May 3 2025 7:52 AM | Updated on May 3 2025 7:52 AM

అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు

అంతర్‌ జిల్లా దొంగల అరెస్టు

రూ.41,50,000 విలువగల వాహనాలు, నగలు, వెండి, నగదు స్వాధీనం

25 కేసుల్లో నిందితులుగా గుర్తింపు

బిక్కవోలు: అంతర్‌ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, నగలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్‌జోన్‌ ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.భవ్యకిషోర్‌ తెలిపారు. శుక్రవారం ఆమె బిక్కవోలు పోలీస్‌ సేష్టన్‌ వద్ద మాట్లాడారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన దల్లి కామిరెడ్డి, చినరాచపల్లి గ్రామానికి చెందిన కచ్చల చిరంజీవి, జంగాలపల్లి గ్రామానికి చెందిన సఖిలేటి సాయి, గిడుతూరు గ్రామానికి చెందిన వళ్లు శ్రీను జనవరి 9 తేదీన బిక్కవోలు మండలం బలభద్రపురంలో మూడు చోట్ల చోరీ యత్నం చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగలించిన బ్రీజా కారుపై వీరు బలభద్రపురం వచ్చారు. వెల్డింగ్‌ షాపులో గ్యాస్‌ సిలిండర్లు, గ్యాస్‌ కట్టర్ల చోరీతో పాటు ఏటీఎంలో దొంగతనం, నగల షాపులో చోరీ ప్రయత్నం చేశారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల సాయంతో నలుగురు ముద్దాయిల్లో ఒకరు అయిన సాయిని గుర్తించారు. అతనిని మార్చి 3వ తేదీన తుని రైల్వేస్టేషన్‌ వద్ద బిక్కవోలు పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో దొంగలించిన బైక్‌ను స్వాధీనం చేసుకొని అతనిని రిమాండ్‌కు పంపించారు. కచ్చల చిరంజీవి మాకవరపుపాలెం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మిగిలిన ఇద్దరు నిందితులు దల్లి కామిరెడ్డి, వళ్లు శ్రీనును గురువారం సాయంత్రం 4గంటలకు తుని రైల్వే స్టేషన్‌ వద్ద అనపర్తి సీఐ సుమంత్‌, ఎస్సై రవిచంద్రకుమార్‌ తన బృందంతో అరెస్టు చేశారు. వారిపై తూర్పుగోదావరి జిల్లాలో 3, కాకినాడ జిల్లా 11, అనకాపల్లి జిల్లా 7, ఏలూరు జిల్లా 1, శ్రీకాకుళం జిల్లా 2, విశాఖ జిల్లాలో 1 కేసులు ఉన్నాయి. వీరి నుంచి 71 గ్రాముల బంగారు వస్తువులు, 1.02 కిలోల వెండి వస్తువులు, రూ. 9,80,000 నగదుతో పాటు మూడు బైకులు, ఒక కారు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు, గ్యాస్‌ కట్టర్‌తో పాటు రూ.41,50,000 విలువగల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement