
గణేష్ శర్మకు కంచిలో ఘన స్వాగతం
అన్నవరం: కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా ఎంపికై న అన్నవరానికి చెందిన యువ పండితుడు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ శనివారం తమిళనాడు కాంచీపురంలోని కంచి కామకోటి పీఠానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు మంగాదేవి, ధన్వంతరి, ఇతర బంధువులతో కలిసి వచ్చిన గణేష్ శర్మకు పెద్ద సంఖ్యలో పండితులు, పీఠం సిబ్బంది మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పెరియస్వామి అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా పీఠంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారని సిబ్బంది తెలిపారు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఈ నెల 30వ తేదీన గణేష్ శర్మకు కంచి కామకోటి పీఠాథిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. అనంతరం, తన శిష్యునిగా స్వీకరిస్తారు. తరువాత పీఠం సంప్రదాయం ప్రకారం గణేష్ శర్మ ఉత్తరాధికారిగా నియమితులవుతారు. భవిష్యత్తులో 71వ పీఠాధిపతిగా నియమితులవుతారు. ఆయన బంధువులు మరికొందరు ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు.