ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు

Jun 3 2025 12:26 AM | Updated on Jun 3 2025 12:26 AM

ఎస్సీ

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు

కాకినాడ సిటీ: జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా డి.పెద్దిరాజు కాకినాడ ప్రగతి భవన్‌లోని కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ షణ్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీశైలం ఈఓగా పని చేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా బదిలీ చేసింది.

2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

కాకినాడ సిటీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ శాఖ, నేషనల్‌ గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యాన ఈ నెల 5న జిల్లాలో 2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రూపొందించిన వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ రాహుల్‌ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి డి.రవీంద్రనాథ్‌రెడ్డి, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ భావన, డీఆర్‌ఓ జె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఈగల్‌ టోల్‌ఫ్రీ నంబర్‌

1972పై విస్తృత ప్రచారం

కాకినాడ సిటీ: మత్తు పదార్థాల నివారణ, సహాయానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్‌ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఫోర్స్‌మెంట్‌)కు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ షణ్మోహన్‌, జేసీ రాహుల్‌మీనా, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, హౌసింగ్‌ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ తదితరులు కలెక్టరేట్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, డ్రగ్స్‌పై నిఘా, నియంత్రణకు ఈగల్‌ డిపార్టుమెంట్‌ పని చేస్తుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈగల్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

పీజీఆర్‌ఎస్‌కు 408 అర్జీలు

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 408 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ షణ్మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

సొంత వారికి కట్టబెట్టేందుకే

రేషన్‌ షాపులు ప్రారంభం

కాకినాడ రూరల్‌: సొంత వారికి కట్టబెట్టేందుకే రేషన్‌ షాపులను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని, ఇది పేదలకు మంచి చేసే కార్యక్రమం కాదని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్ల పొట్టకొట్టి సొంత పార్టీ వారికి రేషన్‌ షాపులు కట్టబెట్టేందుకు పేదలను ఇబ్బందిపాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు గంటల తరబడి రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండీయూ వాహనాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. రేషన్‌ సరకులు ఇంటి వద్దకే రావడంతో ప్రజలు సంతోషించారని, మంచి లక్ష్యంతో ప్రారంభించిన ఈ విధానాన్ని రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం తొలగించడం సబబు కాదని అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు1
1/3

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు2
2/3

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు3
3/3

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీగా పెద్దిరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement