
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని గొల్లవిల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న యాండ్ర సత్యనారాయణ(64) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడని ఇన్చార్జి ఏపీవో వీరబాబు తెలిపారు. గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడని ’ఉపాధి సిబ్బంది ఎమ్.ధనలక్ష్మీ సమాచారం అందించడంతో ఘటనా ప్రదేశానికి వెళ్లి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయగా మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. మృతుడికి గతంలో భార్య మరణించగా, ఇద్దరు కుమారులు ఉన్నారు.
టెన్త్ ఫలితాలు మనమిత్ర,
లీప్ మొబైల్ యాప్లో..
రాయవరం: పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాలను https:// bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లతో పాటుగా, మనమిత్ర(వాట్సాప్), లీప్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, అభ్యర్థి రోల్ నంబరు నమోదు చేయడం ద్వారా విద్యార్థులు పది ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందే వీలుంటుంది.