
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు క్షుణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 68 ఫిర్యాదులు అందగా ఆయా శాఖల అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ ప్రజావాణికి
24 అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 24 అర్జీలు అందాయి. జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి బాధితులు ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఇలా 24 మంది ఫిర్యాదులు చేశారు. అనంతరం ఎస్పీ బాధితులతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని, సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
సివిల్స్ పరీక్షకు
ఉచిత శిక్షణ
గద్వాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 2025–26 సంవత్సరానికి గాను సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 23వ తేదీనుంచి జూలై 7వ తేదీ వరకు http.tsstudycircle.co.in లోదరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 040–23546552, 8121626423 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
జూలై 1 నుంచి విద్యార్థులకు క్విజ్ పోటీలు
గద్వాల: జూలై 1వ తేదీ నుంచి విద్యార్థులకు పర్యావరణ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్ఓ భాస్కరపాపన్న తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ–2025 పోస్టర్ను అదనపు కలెక్టర్ నర్సింగ్రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింగ్రావు మాట్లాడుతూ వాతావరణ మార్పుల పర్యవసనాల నుంచి రక్షణకు విద్యార్థులలో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి చేయాల్సిన అవరముందన్నారు. మొక్కలు నాటడం, నీటిసరంక్షణ, వ్యర్థాలు వేరుచేసే అలవాట్లు విద్యార్థులలో అలవరచాల్సిన అవసరముందన్నారు. ఈకార్యక్రమంలో శ్రీధర్, రాధాకృష్ణారెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణకు కలిసికట్టుగా కృషి
గద్వాల: మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవం వారోత్సవాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణ కోసం అన్ని శాఖల సమన్వయంతో కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రధానంగా యువత భవిష్యత్ను పక్కదారి పట్టింస్తుందని, ఈసంక్షోబాన్ని పకడ్బందీగా అరికట్టాల్సిన అవసరముందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు మండల, జిల్లా కేంద్రాలలో పాఠశాలలు, కాలేజీలు, గ్రామపంచాయతీలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిచాలన్నారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పప్రభావలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్గించాలన్నారు. ఏదేని మత్తుపదార్థల కార్యకలాపాలు గమనిస్తే 144461001908 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం మాదకద్రవ్యాలను నిరాకరించండి అనే సందేశంతో కూడిన పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద, సీఐ నాగేశ్వర్రెడ్డి, నోడల్అధికారి హృదయరాజు పాల్గొన్నారు.

ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి