ప్రజావాణికి 25 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 25 ఫిర్యాదులు

Apr 29 2025 12:16 AM | Updated on Apr 29 2025 12:16 AM

ప్రజా

ప్రజావాణికి 25 ఫిర్యాదులు

గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ శ్రీనివాస్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై మంది 25 ఫిర్యాదులు వచ్చిన్నట్లు తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్‌ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో నరెందర్‌, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మేడేను జయపద్రం చేయండి

గద్వాల: మేడే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జయపద్రం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886లో మే 1వ తేదీని పనిగంటల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా ఆనాటి పాలకుల ఆదేశాలతో చికాగో నగరంలో హే మార్కెట్‌లో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించినట్లు, అనేక మంది కార్మికులు రక్తం చిందించినట్లు తెలిపారు. ఫలితంగా 1989లో మే1వ తేదీని కార్మిక వర్గం దీక్షా దినంగా పాటిస్తూ ఉన్నారన్నారు. మే 1వ తేదీన ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు అడ్డాల వద్ద కార్మిక జెండాలు ఎగురవేసి దీక్షా దినంగా జరుపుకోవాలని కోరారు.

మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

గద్వాల: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం కింద గద్వాల జిల్లాలో కాంట్రాక్ట్‌ విధానంలో మెడికల్‌ ఆఫీసర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు కోరుతున్నట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ప్రకనటలో తెలిపారు. ఈప్రోగ్రాం కింద బస్తి దవాఖానాలలో మూడు ఖాళీ మెడికల్‌ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను పూర్తి చేసి మే 3వ తేదీ సాయంత్రం 5గంటల వరకు డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలని, పూర్తి వివరాలకు https/gadwal.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు

ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్‌ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో ఓటీఎస్‌ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్‌, టెస్కాబ్‌ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్‌ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్‌ రవికుమార్‌, పీఏసీఎస్‌ సీఈఓ రవీందర్‌రావు పాల్గొన్నారు.

ప్రజావాణికి  25 ఫిర్యాదులు 
1
1/1

ప్రజావాణికి 25 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement