ఉపాధ్యాయుల సర్దుబాటు వద్దు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సర్దుబాటు వద్దు

Jun 2 2025 12:43 AM | Updated on Jun 2 2025 12:43 AM

ఉపాధ్యాయుల  సర్దుబాటు వద్దు

ఉపాధ్యాయుల సర్దుబాటు వద్దు

గద్వాల: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టని, ప్రభుత్వం వెంటనే సర్దుబాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం గద్వాల పట్టణంలో స్మృతివనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామని ఓ వైపు ప్రకటిస్తూనే మరోవైపు ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వేసవికాలం మొత్తం ఉపాధ్యాయులు, అధికారులకు శిక్షణ, బడిబాట పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పిల్లలు తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో టీచర్లను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయడం ప్రాథమిక పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విద్యా హక్కుచట్టం ప్రకారం విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30అనేది కేవలం ఉన్నత పాఠశాలలకే పరిమితం చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభాకర్‌శాస్త్రి, ఉదయ్‌కిరణ్‌, హరిబాబు, ప్రవీణ్‌కుమార్‌, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

ఉత్సాహంగా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌ బిన్‌ అహ్మద్‌, జాకీర్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ బుధ, గురువారాల్లో జిల్లాకేంద్రంలోని ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ లో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్‌ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు మీర్‌ ఖాలెద్‌అలీ, మహ్మద్‌ ఇలియాజ్‌, సుబాన్‌జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్‌ ముకర్రం, మహ్మద్‌ షకీల్‌, వినోద్‌కుమార్‌, బాలరాజు పాల్గొన్నారు.

8 వేల బస్తాల వరిధాన్యం రాక

నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఆదివారం ఆర్‌ఎన్‌ఆర్‌, ఇతర సీడ్‌ (1010) కలిపి దాదాపు 8 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి రమే్‌ష్‌ తెలిపారు. కాగా వరి (1010) రకం 2,613 బస్తాలు రాగా క్వింటాల్‌కు సరాసరిగా రూ.1,973 ధర వచ్చింది. అలాగే వరి ఆర్‌ఎన్‌ఆర్‌ 5,283 బస్తాలు రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,272, కనిష్టంగా రూ.1,612 ధర లభించిందని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement