
త్యాగానికి ప్రతీక బక్రీద్
గద్వాలటౌన్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ముస్లింలు జిల్లా కేంద్రంలోని ఈద్గాకు తరలివెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు నమాజ్ చేయించారు. చుట్టుపక్కల గ్రామాల ముస్లింలు సైతం గద్వాల ఈద్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. ప్రార్థనలకు వచ్చే సమయంలో ఈద్గా దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ మొగలయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు అయిజ, అలంపూర్, శాంతినగర్, మానవపాడు తదితర మండలాల్లోని ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఉన్న ఈద్గాల దగ్గర ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా గద్వాల పట్టణంలోని గాంధీచౌక్ నుంచి ఈద్గా వరకు ముస్లిం మైనార్టీల సందడితో బక్రీద్ కళ కనిపించింది. ప్రార్థనల అనంతరం ఈద్గా ప్రక్కన ఉన్న పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ప్రార్థనలు చేశారు.
జిల్లావ్యాప్తంగా ముస్లింల
ప్రత్యేక ప్రార్థనలు
పండుగ శుభాకాంక్షలు తెలిపిన
ప్రజాప్రతినిధులు

త్యాగానికి ప్రతీక బక్రీద్

త్యాగానికి ప్రతీక బక్రీద్