మూడేళ్లలో పాలమూరు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో పాలమూరు పూర్తి

Jun 7 2025 12:24 AM | Updated on Jun 7 2025 12:24 AM

మూడేళ్లలో పాలమూరు పూర్తి

మూడేళ్లలో పాలమూరు పూర్తి

అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్‌ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్‌పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్‌ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్‌లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు.

బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పాలన గత బీఆర్‌ఎస్‌ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ స్వర్ణమ్మ, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్లు ప్రశాంత్‌, కథలప్ప, తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలకు

రూ.102 కోట్లు విడుదల చేస్తాం

చౌదర్‌పల్లి లిఫ్ట్‌కు త్వరలో

అనుమతులిస్తాం

తెలంగాణ రైజింగ్‌ను ఆపలేరు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

పాలమూరును సస్యశ్యామలం చేస్తాం

నిధులు ఆవిరైనా.. నీళ్లు రాలేదని... కాంగ్రెస్‌ ప్రభుత్వమే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరును సస్యశ్యామలం చేస్తారని, అందుకు కేబినెట్‌ కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఉదండాపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ.70 కోట్లు, శంకరసముద్రం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.32 కోట్లను విడుదల చేస్తామన్నారు. అలాగే చౌదర్‌పల్లి లిఫ్ట్‌కు సాధ్యమైనంత త్వరగా ఆర్థికపరమైన అనుమతులిస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్రంలో దొంగలు పడ్డట్లు దోపిడీ చేశారని విమర్శించారు. లేనిది ఉన్న ట్లు.. ఉన్నది లేనట్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement