
సంక్షేమ పథకాలతో పేదలకు మేలు
గద్వాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు దివ్వాంగుల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలిమ్కో సంస్థ ద్వారా జిల్లాలోని 93మంది దివ్యాంగులకు రూ.21.27లక్షల విలువైన పరికాలను అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గట్టు మండంలో గతంలో నిర్వహించిన శిబిరంలో అర్హులైన దివ్యాంగులు గుర్తించి వారికి అవసరమైన అత్యాధునిక పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతిఒక్క దివ్యాంగుడు యూడీఐడీ కార్డు పొందడం ద్వారా దేశంలో ఎక్కడైనా వసతులు పొందవచ్చని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ప్రభుత్వం అందించే సంక్షేమాభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సునంద, ఆల్మిమ్కోప్రతినిధి సునిత తదితరులు పాల్గొన్నారు.
త్వరగా ధాన్యం చెల్లింపులు చేయండి
రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులత సమీక్షించారు. జిల్లా వ్యాపంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి 90శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు, మిగిలిన పదిశాతం ధాన్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆన్లైన్ నమోదు చేసి సంబంధిత రైతులకు చెల్లింపులు చేయాలన్నారు. గతం కంటే ఈసారి మూడు వేల శాతం అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మినారాయణ, నర్సింగ్రావు, డీఎస్ఓ స్వామికుమార్, శ్రీనివాసులు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.