‘పాలమూరు’కు మరో అమాత్యగిరి | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’కు మరో అమాత్యగిరి

Jun 8 2025 12:36 AM | Updated on Jun 8 2025 12:58 AM

ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్‌తో ప్రశంసలు..

కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రను మక్తల్‌ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్‌ అధిష్టానం ఫైనల్‌ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే నేడు లేదంటే ఈనెల పదో తేదీ లోపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

కాంగ్రెస్‌లో ఒకే ఒక్క ముదిరాజ్‌ ఎమ్మెల్యే..

రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్‌ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్‌ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముదిరాజ్‌ల విజ్ఞ ప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరికి మార్చేలా ముందుకు సాగుతామని.. దీంతో పాటు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ముదిరాజ్‌లకు స్థానం కల్పిస్తామని సైతం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో చేపట్టనున్న రాష్ట్ర కేబినెట్‌ కూర్పులో ఆయనకు బెర్త్‌ ఖరారైనట్లు తెలుస్తోంది.

మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి

ముదిరాజ్‌ సామాజిక వర్గం నుంచి కేబినెట్‌ బెర్త్‌ ఖరారు

ఫైనల్‌ చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం..

నేడు లేదంటే పదో తేదీ లోపు అధికారికంగా వెల్లడి ?

‘పాలమూరు’కు మరో అమాత్యగిరి1
1/1

‘పాలమూరు’కు మరో అమాత్యగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement