
పోలీసులు అప్రమత్తం
జిల్లా పోలీసులు గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ప్రమాదకర బావులు, చెరువులు, నీటి గుంతలను గుర్తించారు. వ్యవసాయ బావుల వద్ద పిల్లలు ఈతకు వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా పెద్దలు ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రతి రోజు కళాజాత బృంద సభ్యులచే అవగహన సదస్సులు, సూచనలు, స్వీయజాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈత ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అవసరమైతే ఈత నేర్చుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లలో దొరికే ట్యూబ్లు, రక్షణ జాకెట్లను ధరించాలని సూచిస్తున్నారు. ప్రతి చోటా పోలీసు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదకరమైన బావుల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.