
భూ భారతితో రైతులకు మేలు
కేటీదొడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం కేటీదొడ్డిలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని, భూ పరిపాలన వ్యవస్ధ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాసుబుక్లు, ఆర్.ఓ.ఆర్ చట్టం వంటి చర్యలను గుర్తుచేశారు. అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వార పరిష్కారం లభించనుందని, ఇందులో ఆరు మాడ్యూల్స్ మాత్రమే ఉండడంతో దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, గ్రందాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తహసీల్ధార్ హరికృష్ణ, నాయబ్ తహసీల్ధార్ శివశంకర్, ఏఓ సాజీద్ రెహమ్మాన్, ఆర్ఐ దేవెందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.