
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ చంద్రమౌలి అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవనంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ అమలు చేయాలని, ఆర్టిజన్, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని విడతల వారీగా పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 24న విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకు పూనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ధర్నాతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం చైర్మన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

వాల్పోస్టర్ విడుదల చేస్తున్న ఉద్యోగులు