సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

Jun 23 2025 5:50 AM | Updated on Jun 23 2025 5:50 AM

సోమవా

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్య వ్యాపార ధోరణితో కొనసాగుతుందనే ఆరోపణలు లేకపోలేదు. విద్యార్థుల ఫీజులు మొదలుకొని, పుస్తకాలు, యూనిఫాం, రవాణ, టర్మ్‌ ఫీజుల పేరిట బాదుతున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కాకుండా నోట్‌బుక్స్‌, ఆయా పాఠశాలల వర్క్‌ బుక్స్‌ పేరిట రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవే పుస్తకాలు దుకాణాల్లో కొనుగోలు చేస్తే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు మించవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు బయట కొనుగోలు చేస్తే యాజమాన్యాలు అనుమతించడం లేదనే ఆరోపిస్తున్నారు.

కాటారం: జిల్లాలో పలు ప్రైవేట్‌ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతుంటే మరో పక్క పాఠ్య, రాత పుస్తకాలు, టై, బెల్టులు, యూనిఫామ్స్‌ కూడా పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు నిబంధనలు పెడుతుండటంతో ప్రైవేట్‌లో విద్యను కొనుగోలు చేయడానికి సతమతమవుతున్నారు. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో ఈ తంతు యధావిధిగా నడుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

నామమాత్రంగా తనిఖీలు..

ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, యూనిఫాంలు, టై, బెల్టులు, ఇతర సామగ్రి విక్రయించకూడదని విద్యాశాఖ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని బేఖాతరు చేస్తూ యాజమాన్యాలు తమ వ్యాపారం తాము కొనసాగిస్తున్నారు. ఇది బహిర్గతంగా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులలో లేక ఇతరత్రా సంఘాల నాయకులో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులో పేర్కొన్న పాఠశాలకు అధికారులు ముందస్తు సమాచారం చేరవేసి తనిఖీలకు వెళ్తున్నారనే ఆరోపణలు దండిగా ఉన్నాయి. తప్పనిసరిగా దాడులు చేయాల్సి వస్తే అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేపట్టి కంటితుడుపు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.

న్యూస్‌రీల్‌

యూనిఫాంలు, టై బెల్టుల విక్రయం

మొదలైన విక్రయాలు..

ఈ నెల 12నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. అడ్మిషన్లు జోరుగా జరుగుతుండటంతో ఇదే అదునుగా భావించిన ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలు, ఇతర సామగ్రి పేరిట ఒకే సారి అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో యజమాన్యాలు బహిరంగంగానే పుస్తకాలు, యూనిఫాంల వ్యాపారం కొనసాగిస్తున్నారు. పాఠశాలల్లోనే ఓ గదిలో పాఠ్య పుస్తకాలు, తమ పాఠశాలల పేరిట ముద్రించిన నోట్‌ బుక్కులు, యూనిఫాం, టై, బెల్టులు భద్రపరిచి ప్రత్యేకంగా ఓ ఇన్‌చార్జ్‌ని నియమించి విక్రయాలు చేపడుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా పాఠశాలల్లో బుక్‌ సెంటర్లనే తలపించే రీతిలో పుస్తకాల వ్యాపారాలు కొనసాగుతున్నాయి.

పాఠ్య, పుస్తకాలు,

తల్లిదండ్రులపై ఆర్థిక భారం

చోద్యంచూస్తున్న

విద్యాశాఖ అధికారులు

అంతా వ్యాపార ధోరణే..

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 20251
1/1

సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement