
రోడ్లపైనే సిట్టింగ్
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని వైన్షాపుల ఎదుట బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు సిట్టింగ్ చేస్తున్నారు. సుభాష్కాలనీ, హన్మాన్నగర్, జవహర్నగర్ కాలనీల సమీపాల్లో ఉన్న వైన్షాపులకు పర్మిట్ రూమ్లు ఉన్నప్పటికీ పలువురు మందుబాబులు షాపుల ఎదురుగా, పక్కన రోడ్లపై, ఇతర దుకాణాల ఎదుట బహిరంగానే మద్యం సేవిస్తున్నారు. షాపుల పక్కన కాలనీల మహిళలు, దారి వెంట వెళ్లే మహిళలు, బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మద్యపానంతో రోడ్డుపైనే మలమూత్ర విసర్జన చేయడం ఖాళీ సీసాలను పగలకొట్టడం లాంటి వికృత చేష్టలు చేపడుతున్నారని కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. సుభాష్కాలనీలోని వైన్షాపును తొలగించాలని గతంలో మహిళలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై జిల్లాకేంద్రంలో పోలీస్యంత్రాంగం ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై వాహనాలను పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా కనీసం అటువైపు చూడటం లేదు. జిల్లా కేంద్రంలో పొద్దంతా బహిరంగ మద్యపానం విచ్చలవిడిగా నడుస్తుంది. వార సంత, కేటీకే–5వ గని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుకాల, అంబేడ్కర్ క్రీడా మైదానం, బాంబులగడ్డ, మంజూర్నగర్లో వెంచర్ల ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారు.
జిల్లాకేంద్రంలో విచ్చలవిడిగా బహిరంగ మద్యపానం
ఇబ్బందులు పడుతున్న మహిళలు

రోడ్లపైనే సిట్టింగ్