దేవాలయాల అభివృద్ధికి కృషి.. | - | Sakshi
Sakshi News home page

దేవాలయాల అభివృద్ధికి కృషి..

May 1 2025 1:13 AM | Updated on May 2 2025 2:53 PM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్‌: దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీలో బుధవారం పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోచమ్మ గుడి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని పెద్దకుంటనల్లి తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోద్దన్నారు.

అధికారుల సేవలు మరువలేనివి

భూపాలపల్లి: జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, బీసీ సంక్షేమ అధికారి శైలజ జిల్లాకు అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. నారాయణరావు, శైలజ ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం రాత్రి ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే, కలెక్టర్‌ ముఖ్య అతిథులుగా హాజరై వారిని సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement