
ఎండను ఎదుర్కొందాం..
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి వరంగల్జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో 42నుంచి 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోల్బెల్ట్ ఏరియా అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మే నెలలో 46డిగ్రీలకుపై బడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం పది గంటలు దాటితే అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో మూగజీవాలు, పక్షులకు తాగునీటి వసతి కల్పించాలి. ఇప్పుడు ప్రతి నగరం, పట్టణ కేంద్రాల్లో రూఫ్గార్డెన్లతో ఇంటికి అవసరమైన కూరగాయలు పండిస్తున్నారు. వారు ఎండవేడికి మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం ఉంటుంది. మధ్యతరగతి, ఆపై ఉన్నత కుటుంబాల వారు కారు మెయింటెన్ చేస్తుంటారు. మండే ఎండలకు వీటి నిర్వహణ బాగుంటేనే మన ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈ నేపథ్యంలో వేసవిని ఎదుర్కొనేందుకు వైద్యులు, వ్యవసాయశాస్త్రవేత్తలు, పశువైద్యాధికారులు చెబుతున్న సూచనలు, సలహాలు మీకోసం..
డీహైడ్రేషన్కు గురికావొద్దు..
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఓపెన్కాస్టులోని పని ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొంత అధికంగా ఉంటుంది. మొదటి షిప్టులో పనిచేసే కార్మికులు పూర్తిగా ఎండలోనే పనిచేయాల్సి ఉంటుంది. కార్మికులు డీహైడ్రేషన్కు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరు రోజుకు కనీసం ఐదు లీటర్లకు మించి చల్లటి నీరు తాగాలి. ప్రతి రోజు ఓఆర్ఎస్, మజ్జిగ తాగాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. తలపాగ ఉపయోగించడం మంచిది. ఆయిల్ ఫుడ్ తినొద్దు. ఎండలో పనిచేయడం వలన నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడి బారి, నాలుక ఆరిపోతుండడం, వాంతులు, విరోచనాలు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎండ దెబ్బకు గురైన వెంటనే నీడకు చేర్చి చల్లగా ఉండే పలుచని దుస్తులను వేయాలి. తడి గుడ్డతో తుడవాలి. ప్రమాద తీవ్రత అఽధికంగా ఉంటే సింగరేణి ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ పద్మజ, సింగరేణి ఏరియా ఆస్పత్రి ఏసీఎంఓ