వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!

Apr 26 2025 1:21 AM | Updated on Apr 26 2025 1:21 AM

వృద్ధ

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!

ఎంజీఎం : వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. ఎండాకాలం తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి ఆయన పలు సూచనలు చేశారు.

– డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌, ఎండీ,

ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, భూపాలపల్లి

● అవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకపోవడం మంచిది.

● తేలిగ్గా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. రోజుకి 10 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి

● మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్బుజా తినాలి.

● అహారంలో మసాలా, ఉప్పు తగ్గించి వాడాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం మంచిది.

● వృద్ధులు అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగరాదు. బీపీ, షుగర్‌ రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోవాలి.

● కొన్ని రకాల మాత్రలు (డియురేటిక్స్‌, ఎస్‌జీఎల్‌టీ 2 ఇన్‌హిబిటర్స్‌) వల్ల శరీరంలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉంది.

● తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఉన్నట్లయితే ఎండదెబ్బ తగిలినట్టుగా భావించి డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

● డయాబెటిక్‌ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, రెగ్యులర్‌గా షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి.

● డాక్టర్‌ సలహా లేకుండా మందులు మానేయరాదు.

● గర్భిణులు నీరు, ఆహారం, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!
1
1/1

వృద్ధులు, గర్భిణులు జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement