
‘మేఘా’కే టెంట్సిటీ నిర్మాణం?
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టి తాత్కాలిక టెంట్సిటీ నిర్మాణం పనులు మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టనున్నట్లు సమాచారం. రూ.83లక్షల వ్యయంతో భక్తుల కోసం వీఐపీ (సరస్వతి)ఘాటు వద్ద నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. దీంతో టూరిజంశాఖతో నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఆ సంస్థ శ్రద్ధ చూపలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మేఘా సంస్థతో తాత్కాలిక టెంట్సిటీ నిర్మాణాలు సుమారు 50వరకు నిర్మించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దేవస్థానం గుడిమాన్యం ఆరు ఎకరాల స్థలాన్ని టెంట్సిటీకి అప్పగించి, ఆ భూమిలో మిర్చి పంట వేసిన రైతులకు రూ.4లక్షల వరకు పరిహారం అందజేసిన విషయం తెలిసిందే.