
ప్లీనరీ వాల్పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఈ 21న హైదరాబాద్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్లీనరీని విజయవంతం చేయాలని కోరుతూ.. మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సాంబ లక్ష్మి మాట్లాడుతూ.. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాద్లోని సీతాఫల్ మండిలో ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారులకు గుర్తించి కార్డులు, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి ఇంటి స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమకారులు సునితారెడ్డి, ప్రసన్న శారద, రాజేశ్వరి, రమాదేవి, లక్ష్మి, లత, పుష్ప పాల్గొన్నారు.