సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం | - | Sakshi
Sakshi News home page

సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం

Apr 14 2025 1:17 AM | Updated on Apr 14 2025 1:17 AM

సమష్టి అవగాహన,  కఠిన చర్యలు అవసరం

సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం

రమ్మీ యాప్‌ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్‌ క్రైమ్‌పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్‌ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్‌ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి.

– డాక్టర్‌ బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్‌, సీనియర్‌ మానసిక వైద్య నిపుణులు

నిషేధించిన

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దు

ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్స్‌పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్‌లైన్‌ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు.

– కొత్త దేవేందర్‌ రెడ్డి,

ఏసీపీ, హనుమకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement