రేపు రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రేపు రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

కాజీపేట రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటనలో వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్‌ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్‌ అండర్‌ రైల్‌), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement