కేయూ క్యాంపస్: టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని గుజరాత్ రాష్ట్రంలోని ఇన్ఫ్లిబినెట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవికా పి మదల్లి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో కేయూ పరిధిలోని లైబ్రరీ అసిస్టెంట్లకు సోమవారం నిర్వహించిన ఇన్ఫ్లిబినెట్ రీజినల్ ట్రైనింగ్ ప్రోగ్రాం లైబ్రరీ ఆటోమేషన్ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. వన్నేషన్ ఇన్ సబ్స్క్రిప్షన్ కార్యక్రమం కింద సుమారు 6,500 సంస్థలు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లైబ్రరీకి రూసా నిధుల కింద రూ.2 కోట్లు, ప్రాజెక్టు కింద రూ.49 లక్షలు, సాధారణ బడ్జెట్లో రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన విశ్రాంత ఆచార్యులు ఏఆర్డీ ప్రసాద్ మాట్లాడుతూ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిట్ లైబ్రేరియన్ ప్రొఫెసర్ వై. శ్రీనివాస్రావు, సోషల్ సైన్స్, ఆర్ట్స్ డీన్ బి.సురేశ్లాల్ తదితరులు పాల్గొన్నారు.


