ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు

May 30 2025 1:10 AM | Updated on May 30 2025 1:10 AM

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు

ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు

జనగామ: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏసీపీ చేతన్‌ నితిన్‌తో కలిసి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయ న మాట్లాడారు. జూన్‌ 2వ తేదీన నిర్వహించే ఈ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చూపించేందుకు ఆయా శాఖలు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయ ని, వీటి నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ తీసుకోవాలని చెప్పారు. రాజీవ్‌ యువ వికాసం, ఇందిర మ్మ ఇళ్ల పథకం, బ్యాంకు లింకేజీ కింద అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నా రు. జిల్లా, మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ, పోలీసు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని తెలిపారు. సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, కలెక్టరేట్‌ ఏఓ మన్సూర్‌, డీఈఓ భోజన్న, పౌరసరఫరాల అధికారి సరస్వతి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఉద్యానవన అధికారి శ్రీధర్‌రావు, డీవైఎస్‌ఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలకు

పకడ్బందీ ఏర్పాట్లు..

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏసీపీ చేతన్‌ నితిన్‌ పండేరీతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ 3 నుంచి 13 వరకు జరిగే టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశామని, 74 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాల ని, మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్ట మైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ భోజన్న, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గౌసియాబేగం తదితరులు పాల్గొన్నారు.

అన్ని శాఖల అధికారులు

సమన్వయంతో పనిచేయాలి

రాష్ట్ర అవతరణ వేడుకల సన్నాహక

సమావేశంలో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement