
సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలి
● భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
జనగామ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భార త్ స్టేషన్ స్కీమ్లో జనగామ రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు త్వరగా చేపట్టాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. ఈ మేర కు దక్షిణ మధ్య రైల్వే డీజీఎం ఉదయ్తో ఫోన్లో మాట్లాడా రు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డితో కలిసి గురువారం ఆయన రైల్వేస్టేషన్ సుందరీరణ పనులను పరిశీలించారు. మొదటి విడత సుందరీకరణ పనులకు రూ.24.75 కోట్లు మంజూరైనా పనులు ఆలస్యం కావడంపై డీజీఎంను ఎంపీ అడగ్గా.. నవంబర్ నాటికి వందశాతం పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురా వాలని ఆయన కోరారు. అయితే.. రైల్వేస్టేషన్ ఆవరణలో గ్రీనరీకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫుట్ఓవర్ బ్రిడ్జి, రెండు ప్లాట్ ఫాంలపై వానరాలతో ప్రయాణికులకు ఇబ్బందులున్నాయని, సోలార్ పెన్షింగ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డీజీఎంకు ఎంపీ సూచించారు.