
ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
దేవరుప్పుల : రాజకీయాలకు అతీతంగా సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం ఉదయం(అమెరికా కాలమా నం ప్రకారం) డల్లాస్లో జూన్ 1న అమెరికాలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు విస్తృత ప్రచా రంతోపాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వా న తెలంగాణ సాధనతోనే దగాపడిన రాష్ట్రంలో నీరు, విద్య, ఉద్యోగ కల్పనతోపాటు వ్యవసాయరంగం పురోగతిని గణనీయంగా పెంచుకోగలిగా మని చెప్పారు. సప్తసముద్రాలు దాటి స్థిరపడిన ఎన్ఆర్ఐలు జన్మభూమి కోసం ఉద్యమాలు చేశార ని గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రాత్మక అభివృద్ధికి దోహదపడిన బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ఉత్సవాలకు ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో హాజరై భవిష్యత్ కార్యాచరణకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఎర్రబెల్లితోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు దామోదర్రెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.