
‘విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం’
జనగామ రూరల్: విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవనంలో టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి సంఘం పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం ఆవిర్భావం నుంచి నేటి వరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల, విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీ అంకుషావలి, బి.లక్ష్మయ్య, శ్రీరామ్, రాజారెడ్డి, శ్రీహరి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.