
వైభవంగా సోమేశ్వరస్వామి మాస కల్యాణం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా చండిక అమ్మవారి ఆలయంలో ఆదివారం చండికాసమేత సోమేశ్వర స్వామివారికి మాస కల్యాణం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈసెట్లో గూడూరు
విద్యార్థి ప్రతిభ
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన విద్యార్థి మాచర్ల గణేశ్ ఆదివారం విడుదల చేసిన ఈసెట్ ఫలితాల్లో సీఎస్సీలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంక్, ఇంటిగ్రేట్డ్ 13వ ర్యాంక్ సాధించాడు. గూడూరు గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన మాచర్ల సదానందం, సరస్వతి దంపతుల కుమారుడు గణేష్ పదో తరగతిలో మండల టాపర్, పాలిసెట్లో రాష్ట్రస్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. ఈసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన గణేశ్ను గ్రామస్తులు అభినందించారు.
నేటి నుంచి లైసెన్స్డ్
సర్వేయర్లకు శిక్షణ
జనగామ: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) ద్వారా అర్హత సాధించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు నేటి (సోమవారం) నుంచి జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు శిక్షణ ప్రారభమవుతుందన్నారు. 50 రోజుల పాటు సర్వేయర్లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. అర్హత కలిగిన సర్వేయర్లు శిక్షణకు హాజరయ్యే క్రమంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, లేదంటే శిక్షణకు అనుమతించమన్నారు.
94 మంది గైర్హాజరు
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 94 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్, ఒకేషనల్ మొత్తం 1,137 విద్యార్థులకు గాను 1,068 విద్యార్థులు హాజరు కాగా 69 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులు మొత్తం 742 గాను 717 విద్యార్థులు హాజరు కాగా 25 గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సందర్శించారు. డెక్ సభ్యులు జనగామ, జఫర్గఢ్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

వైభవంగా సోమేశ్వరస్వామి మాస కల్యాణం