పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం

May 26 2025 1:10 AM | Updated on May 26 2025 1:10 AM

పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం

పేదల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

బచ్చన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని విస్మరించి బడా బాబులకు పట్టం కడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం మండలంలోని గోపాల్‌నగర్‌ గ్రామంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన గబ్బెట గోపాల్‌రెడ్డి స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి గోపాల్‌నగర్‌ కార్యదర్శి పర్వతం నర్సింహులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారి న పేదల బతుకులు మారడం లేవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, కార్యవర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్‌, మండల ఇన్‌చార్జ్‌ సుంచు విజేందర్‌, బెల్లంకొండ వెంకటేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement