
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: మే 4వ తేదీన జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష 2025 (నీట్)కు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, సంబంధిత అధికారులతో కలిసి సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి 582 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే రహదారి భద్రతపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై స్పీడ్ బ్రే కర్లు ఏర్పాటు చేయాలన్నారు.
చట్టాలపై అవగాహన
ఉండాలి
సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ విక్రమ్
జనగామ రూరల్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సి.విక్రమ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాల సదనాన్ని ఆయన సందర్శించి జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీంపై పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్ల లకు ఎప్పుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ స్నేహభావంతో ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పిల్లల వసతులు భోజనం, టిఫిన్స్, స్నాక్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.కృష్ణవేణి, బి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల తుది జాబితా విడుదల
జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, ఉద్యోగ నియామకానికి ఎంపికై న వివరాలను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిఖార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా 33 పోస్టుల భ ర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విధి తమే. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ను అధికారిక వెబ్సైట్తో పాటు కలెక్టరేట్లోని జి ల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ నోటీసు బో ర్డుపై అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశా రు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే, అందుకు అవసరమైన వివరాలను జోడించి, మే 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్ఓ కా ర్యాలయంలో అందించాలన్నారు. కాగా ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో మే 2వ తేదీన ఉదయం 11.30 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలన్నారు.
అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి
జనగామ రూరల్: టీజీపీఎస్సీలో వసతి గృహ సంక్షేమ అధికారిగా ఎంపికై న గ్రేడ్–2 అభ్యర్థులు జోన్ 5లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని న ల్లగొండ ఉపసంచాలకులు ఎన్.ప్రేమ్కరణ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. నేడు (బుధవారం) 10.30గంటలకు నల్ల గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు