
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
● ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని, నాణ్యమైన విద్య అందించడానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధ్యా య శిక్షణ కేంద్రాలను గురువారం సందర్శించారు. అభ్యాసన సామర్థ్యాలను పెంచుకుని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డీఈ వో రాము మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా పాఠశాలల్లో బోధన నడుస్తోందని, మరింత మెరుగుపర్చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినందుకు భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. సెక్టోరియల్ అధికారులు కొక్కుల రాజేశ్, సత్యనారాయణ, బోనగిరి దేవయ్య, ప్రసాద్రావు, నరేందర్రావు, ఒడ్నాల రాజశేఖర్, మచ్చ శంకర్ పాల్గొన్నారు.
మోసం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు
మెట్పల్లి: బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు తిరిగి వస్తే చేర్చుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో పదవులతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందిన కొందరు ప్రభుత్వం మారిన తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లారని, అలాంటి వారు ఆ పార్టీల్లో ఇమడలేక తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకపోవాలన్నారు. సమావేశంలో పట్టణాధ్యక్షులు చంద్రశేఖర్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
షరతుల్లేకుండా
పథకాలు అందించాలి
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
రాయికల్: నిరుద్యోగులకు సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కేవలం అరగుంటకే పరిమితం చేశారని, సిబిల్ స్కోర్ ఉన్న నిరుద్యోగులకే యువ వికాసం అమలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పథకాల అమలులో జాప్యం చేయడం కోసమే ఇలాంటి షరతులు పెట్టారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ఎనగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం