
నిరుపేదల సొంతింటి కల సాకారం
మల్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలకేంద్రంలో గురువారం 303మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ అర్హులందరికీ సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన మేరకే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. జియో ట్యాగింగ్ చేసిన స్థలంలో మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు. తహసీల్దార్ వసంత, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లేశ్వరి, ముత్యాల రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.