
వానాకాలం రుణ ప్రణాళిక ఖరారు
● ప్రస్తుత సీజన్లో రూ.1540 కోట్ల రుణాలు ● గతేడాదితో పోల్చితే రూ.166 కోట్లు అదనం
● జిల్లాలో 24 బ్యాంకుల ద్వారా పంపిణీకి సిద్ధం
రుణం ఇచ్చేందుకు పేచీలు పెట్టొదు
పంట రుణం ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు సర్టిపికెట్ల పేరిట పేచీ పెడుతున్నాయి. రుణం ఎక్కువ అడిగితే మార్టిగేజ్ చేయమంటున్నారు. కొన్ని బ్యాంకులు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా తనఖా పెట్టుకుంటున్నాయి. ఎలాంటి నిబంధన లేకుండా రుణాలు ఇవ్వాలి.
– మల్లారెడ్డి, ఎండపల్లి
పంపిణీ ప్రారంభమైంది
అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాత రుణాలు చెల్లించి.. కొత్త రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు పంట రుణం ఇస్తాం. పట్టాదారు పాస్ బుక్లో వ్యవసాయ భూమి ఏ మేరకు ఉంటే, ఆ మేరకు పంట రుణం ఇస్తున్నాం.
– రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ పంటల రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గతేడాదితో పోల్చితే రూ.166 కోట్లు అదనంగా ఇచ్చేందుకు బ్యాంకర్లు గ్రీన్సిగ్నల్ ఇచ్చాయి. మొత్తంగా ఈ వానాకాలం పంటల సాగుకు రూ.1,540 కోట్లు రుణాలుగా అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిని జిల్లాలోని 24 బ్యాంకు శాఖల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే బ్యాంకులు 10 శాతం మేర పంట రుణాలు ఇవ్వగా.. మిగిలిన రైతులు పాత రుణాలు చెల్లించి, కొత్తగా రుణం తీసుకుంటున్నారు.
లక్ష్యం రూ 1540 కోట్లు
జిల్లాలో గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట బ్యాంకులు కలిపి దాదాపు 129 శాఖలు ఉన్నాయి. అన్ని బ్యాంకు శాఖలు పంట రుణాలు ఇచ్చేలా కలెక్టర్ సత్యప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ లక్ష్యాన్ని నిర్దేశించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,54,449 మంది రైతులకు రూ.2,564.65 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్లో 92,671 మంది రైతులకు రూ.1540 కోట్లు, యాసంగిలో 61,778 మంది రైతులకు రూ.102.65కోట్లు రుణాలుగా అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అత్యధికంగా పంట రుణాలను ఇచ్చే బ్యాంకులు
బ్యాంకు రైతులు పంట రుణం
(కోట్లలో)
కో–ఆపరేటివ్ 18,020 299.00
యూనియన్ 17,329 288
ఎస్బీఐ 15,602 259
తెలంగాణ గ్రామీణ 11,406 189
కెనరా 7,004 116
ఇండియన్ 6,539 109

వానాకాలం రుణ ప్రణాళిక ఖరారు

వానాకాలం రుణ ప్రణాళిక ఖరారు