
ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలి
జగిత్యాలరూరల్/ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లిలోగల కేంద్రం, ధర్మపురి మండలం జైన సహకార సంఘం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కాంటా చేసి మిల్లులకు తరలించాలన్నారు. వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జి తహసీల్దార్ సుమన్ పాల్గొన్నారు.
లైసెన్స్లు లేకుండా విత్తనాలు అమ్మొద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: లైసెన్స్ లేకుండా రైతులకు విత్తనాలు అమ్మొద్దని, విత్తనాలు కొంటే రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం సమీక్షించారు. బీటీ–3 పత్తి, లూస్, నకిలీ, గడువు తీరిన విత్తనాలపై నిషేధం ఉందని, విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే రైతులు అధికారులను సంప్రదించాలన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.