ఇది విద్యార్థుల విజయమే | - | Sakshi
Sakshi News home page

ఇది విద్యార్థుల విజయమే

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

ఇది విద్యార్థుల విజయమే

ఇది విద్యార్థుల విజయమే

జగిత్యాల: ఇది విద్యార్థుల విజయమేనని, ఒక దశ మాత్రమేనని, మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను శుక్రవారం అభినందించారు. తక్కువ మార్కులు వచ్చాయని నిరాశపడకుండా, ప్రయత్నాలు కొనసాగిస్తే విజయం సాధ్యమవుతుందని అన్నారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు సైతం పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాము, కో ఆర్డినేటర్‌ సత్యనారాయణ, రాజేశ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

నీట్‌పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఈనెల 4న జరుగనున్న నీట్‌పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, ఎస్పీ అశోక్‌కుమార్‌, ఆర్డీవో మధుసూదన్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement