లిబర్టీ: దేశంలో బీసీలు పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోతున్నారు తప్ప అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు డి.కుమారస్వామి అన్నా రు. బీసీల అభ్యున్నతికి ఢిల్లీ వరకు బీసీల యుద్ధం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘బీజేపీ హటావో.. బీసీ బచావో’ నినాదంతో ఉద్య మం కొనసాగిస్తామన్నారు. ఆదివారం దళ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హక్కుల సాధనకు సంఘటితంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. కుల గణనను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్క న పెట్టిందన్నారు. కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మాత్రం మారడం లేదన్నారు. బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సమావేశంలో నవ్య, సాయి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.