ఈసీఐఎల్‌ సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

ఈసీఐఎల్‌ సేవలు ప్రశంసనీయం

Mar 24 2023 6:34 AM | Updated on Mar 24 2023 6:34 AM

కుషాయిగూడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) చేపడుతున్న సేవాకార్యక్రమాలు ప్రశంసనీయమని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశంసించినట్లు గురువారం సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో భాగంగా రూ. 69.66 లక్షల విలువైన ల్యాప్రోస్కోపిక్‌ రెండు అధునాతన యంత్రాలను సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావుకు అందజేశారు. సిద్దిపేట, గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈసీఐఎల్‌ ఏజీఎం మునికృష్ణ, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి. వేణుబాబు, పర్సనల్‌ ఆఫీసర్‌ సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీష్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement