అంగన్వాడీ సెంటర్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీఆర్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏఎస్పీ శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని అంగన్వాడీ టీచర్కు సూచించారు. మంత్రి వెంట తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు.


