
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
హన్మకొండ: శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని హనుమకొండ దీన్దయాళ్నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ.. దేశం కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన జాతీయవాది, అఖండ భారత్ కోసం ప్రాణాలు వదిలిన భరతమాత ముద్దుబిడ్డ, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేంగే, నహీ చలేంగే’ అంటూ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం పోరాడుతూ.. అసువులు బాసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమం తర్వాత నాయకులు పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు దొంతి దేవేందర్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, గుజ్జ సత్యనారా యణరావు, మాలోతు నాను నాయక్, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రత్నలక్ష్మి, సండ్ర మధు, చల్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.