భద్రకాళికి గంధోత్సవం | - | Sakshi
Sakshi News home page

భద్రకాళికి గంధోత్సవం

May 6 2025 12:32 AM | Updated on May 6 2025 12:32 AM

భద్రకాళికి గంధోత్సవం

భద్రకాళికి గంధోత్సవం

హన్మకొండ కల్చరల్‌ : శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రకాళి దేవాలయంలో అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారి స్వపనమూర్తికి గంధంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తిని సాలభంజికవాహనంపై ప్రతిష్ఠించి ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాల పద్మశాలి సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు లయన్‌ డాక్టర్‌ ఆడెపు రవీందర్‌, మేయర్‌ గుండు సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, కో–ఆర్డినేటర్‌ నరేందర్‌, కుసుమ సతీశ్‌, సాంబారి సమ్మారా వు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు ఉచిత శిక్షణ..

దరఖాస్తుల ఆహ్వానం

న్యూశాయంపేట: రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి యూపీఎస్సీ సీఎస్‌ఏటీ–26 ఉచిత శిక్షణకు మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు వరంగల్‌, హనుమకొండ జిల్లాల మైనార్టీ సంక్షేమాధికారి డి.మురళీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష మెరిట్‌ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు సీఈటీ.సీజీజీ.జీఓవీ.ఇన్‌టెమ్రిస్‌ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, ఈనెల 24 వరకు చివరి తేదీగా పేర్కొన్నారు. వచ్చేనెల 5న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న టెమ్రిస్‌ గురుకులాల్లో స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుందని తెలిపారు. వివరాలకు హనుమకొండ కలెక్టరేట్‌లో లేదా 040–232361120 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

‘డీపీఎల్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ఎంజీఎం: డాక్టర్లు ‘బీ ఫిట్‌ టు ట్రీట్‌’ ఉద్దేశ్యంతో వరంగల్‌ డాక్టర్స్‌ క్రికెట్‌ క్లబ్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈనెల 17 నుంచి 26 వరకు కాకతీయ మెడికల్‌ కాలేజీ మైదానంలో డాక్టర్స్‌ పీమియర్‌ లీగ్‌ (డీపీఎల్‌) నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఐఎంఏ వరంగల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. పది రోజులు జరిగే ఈలీగ్‌లో 150 మంది డాక్టర్లు 8 బృందాలుగా ఏర్పడి 15 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, సెక్రట రీ అజిత్‌ మహ్మద్‌, ఫైనాన్స్‌ సెక్రటరీ శిరీష్‌కుమార్‌, తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ట్రెజరర్‌ పి.విజయచందర్‌రెడ్డి, డబ్ల్యూడీసీసీ సెక్రటరీ రాఘవేంద్ర ప్రదీప్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసన్న, నాయకులు సంధ్యారాణి, జనార్దన్‌, బందెల మోహన్‌రావు, రమేశ్‌ పాల్గొన్నారు.

8న జాబ్‌ మేళా..

హన్మకొండ అర్బన్‌: నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 8న జాబ్‌ మేళా నిర్వహి స్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాఽధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపా రు. పేటీఎం, జస్ట్‌ డయల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌–ఎన్‌ఐఐటీల్లో ఫీల్డ్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటి వ్‌, సర్టిఫైడ్‌ ఇంటర్నెట్‌ కన్సల్టెంట్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి 30 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నా రు. వయసు 18–35 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్సెస్సీ, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్‌ జిరా క్స్‌లతో 8న ఉదయం 11 గంటల వరకు ము లుగు రోడ్డు ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో హాజరుకావాలన్నారు. వివరాలకు 78933 94393 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

రేపు చర్చా గోష్టి

హన్మకొండ కల్చరల్‌ : ఈనెల 7న ఉదయం 10 గంటలకు హనుమకొండ పింజర్ల రోడ్డులోని రాజ రాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో తెలుగుభాష పరిరక్షణపై చర్చా గోష్టి నిర్వహిస్తున్నట్లు కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

తాగునీటి సమస్య

పరిష్కారానికి టోల్‌ ఫ్రీ

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తితే కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 3424కు సమాచారం అందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శార ద ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement